ఏపీఎల్ సీజన్-5 ఫైనల్కు ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-5 ఫైనల్ మ్యాచ్కు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన స్పోర్ట్స్ హబ్లో జరిగిన ఈ ఫైనల్ పోరును మంత్రి ప్రారంభించి, ఇరు జట్ల ఆటగాళ్లను అభినందిస్తూ ఉత్సాహపరిచారు.
భీమవరం బుల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్ల మధ్య జరిగిన టైటిల్ పోరుకు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంట్ సభ్యుడు, ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని) నాయకత్వంలో జరిగిన కృషిని మంత్రి ప్రశంసించారు. కేవలం రెండేళ్లలోనే ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ ప్రమాణాల క్రికెట్ స్టేడియంలు సిద్ధం కావడం అభినందనీయమని పేర్కొన్నారు.
అనంతరం మంత్రి నారా లోకేష్ను కేశినేని శివనాథ్ (చిన్ని) సమక్షంలో ఆత్మీయంగా కలిసిన సందర్భంగా పలువురు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.