BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 19 March 2026, 10:52 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఖర్చు తగ్గింపు, భద్రత పెంపు!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 10:52 AM
142 వీక్షణలు

ఏపీలో అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు… ఖర్చు తగ్గింపు, భద్రత పెంపు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 44,346 ఇండక్షన్ స్టవ్‌లను మంజూరు చేసింది. Energy Efficiency Services Limited (EESL) సహకారంతో ఈ స్టవ్‌లను సరఫరా చేయనున్నారు.

ఈ ఇండక్షన్ స్టవ్‌లు సంప్రదాయ ఎల్పీజీ వంట విధానంతో పోలిస్తే సుమారు 30 శాతం ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఈ చర్యతో ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం దాదాపు రూ.24 కోట్ల గ్యాస్ వ్యయం ఆదా కానుంది.

అదేవిధంగా, ఈ స్టవ్‌లు పర్యావరణహితంగా ఉండటంతో పాటు అంగన్వాడీ కార్యకర్తలకు పొగలేని, సురక్షితమైన వంట వాతావరణాన్ని కల్పిస్తాయి. దీంతో ఆరోగ్య పరిరక్షణతో పాటు పనితీరు కూడా మెరుగుపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.