ఖర్చు తగ్గింపు, భద్రత పెంపు!
ఏపీలో అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్లు… ఖర్చు తగ్గింపు, భద్రత పెంపు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 44,346 ఇండక్షన్ స్టవ్లను మంజూరు చేసింది. Energy Efficiency Services Limited (EESL) సహకారంతో ఈ స్టవ్లను సరఫరా చేయనున్నారు.
ఈ ఇండక్షన్ స్టవ్లు సంప్రదాయ ఎల్పీజీ వంట విధానంతో పోలిస్తే సుమారు 30 శాతం ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఈ చర్యతో ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం దాదాపు రూ.24 కోట్ల గ్యాస్ వ్యయం ఆదా కానుంది.
అదేవిధంగా, ఈ స్టవ్లు పర్యావరణహితంగా ఉండటంతో పాటు అంగన్వాడీ కార్యకర్తలకు పొగలేని, సురక్షితమైన వంట వాతావరణాన్ని కల్పిస్తాయి. దీంతో ఆరోగ్య పరిరక్షణతో పాటు పనితీరు కూడా మెరుగుపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.