www.ntodaynews.com
ఏపీలో జూన్ 7 నుంచి యోగా కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 7 నుంచి 21 వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల మందిని ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
ప్రకృతి సిద్ధమైన యోగా విధానాల ద్వారా 21 రకాల వ్యాధుల నివారణకు సంబంధించిన ప్రత్యేక వీడియోలను యోగా నిపుణుడు మంతెన సత్యనారాయణ రూపొందించారని మంత్రి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు 81424 04888 నంబర్కు వాట్సాప్లో ‘హాయ్’ అని మెసేజ్ పంపి వీడియోల లింక్ను పొందవచ్చని సూచించారు.
ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి యోగా కార్యక్రమాలను విస్తృతంగా వినియోగించుకోవాలని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు.