BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 17 July 2026, 06:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో మళ్లీ కొవిడ్ కలకలం.. 12 కేసులు నమోదు, నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jul, 2026 - 06:14 PM
83 వీక్షణలు

ఏపీలో మళ్లీ కొవిడ్ కలకలం.. 12 కేసులు నమోదు, నలుగురు మృతి

అమరావతి: రాష్ట్రంలో జూన్ 26 నుంచి జూలై 16 వరకు మొత్తం 12 కొవిడ్-19 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదు కాగా, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో చెరో ఒక కేసు గుర్తించారు. ఇదే కాలంలో కొవిడ్ పాజిటివ్‌తో నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

ఐదు నమూనాలను జన్యుక్రమ విశ్లేషణ కోసం పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు చెదురుమదురుగానే నమోదవుతున్నాయని, ఎలాంటి క్లస్టర్లు గుర్తించలేదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ముగ్గురు హోం ఐసోలేషన్‌లో ఉండగా, ఇద్దరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.

ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి మొత్తం 339 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో కేరళలో అత్యధికంగా 115 కేసులు నమోదు కాగా, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.