ఏప్రిల్ 16 నుండి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు
ఏప్రిల్ 16 నుండి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏప్రిల్ 16 నుండి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటన లో తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెడికల్ అండ్ హెల్త్, చేనేత శాఖ,జిల్లా గ్రామీణ అభివృద్ధిశాఖల అధికారుల ఆధ్వర్యంలో శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని,ఈ శిబిరాలలో చేనేత కార్మికులకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు,వివిధ రకాల వ్యాధులపై నిపుణుల ద్వారా వైద్య సేవలు అందించబడతాయని తెలిపారు. అనుభవం ఉన్న జనరల్ ఫిజీషియన్,ఆర్థో పిజీషియన్, ఆప్తమాలజిస్ట్ లతో వివిధ సమస్యలను ఎదుర్కొంటున్న కార్మికులకు ప్రత్యేక చికిత్సలు అందించనున్నట్లు పేర్కొన్నారు.అన్ని మండలాలలో దశల వారీగా ఈ వైద్య శిబిరాలు నిర్వహించబడతాయని, చేనేత కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.అదేవిధంగా, అవసరమైన వారికి ఉచిత మందులు, చికిత్సలు కూడా అందించబడతాయని, వ్యాధుల తీవ్రతను రిఫరల్ హాస్పటల్ తీసుకొని వెళ్లడం జరుగుతుందని తెలిపారు .