www.ntodaynews.com
అగ్ని ప్రమాద సుమారు 20000 నష్టం
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలో పుంగనూరు మండలం ఆరేడు గుంట పంచాయతీ కూరపల్లి గ్రామ సమీపాన ఉన్నటువంటి మామిడి తోట అగ్ని ప్రమాదం కు గురైనదని 26-03-2026 తేదీన సుమారు 11:45 నిమిషాలకు అగ్ని ప్రమాద వార్త వచ్చిన వెంటనే కేంద్రాధికారి గారి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి సంఘటన స్థలము చేరుకొని యజమాని ఇ. మునస్వామి తండ్రి పేరు ఇ. గంగయ్య కు చెందినటువంటి మామిడి తోట మరియు నీలగిరి తోటలను ముందుగా సెల్ఫ్ ట్యాంక్ సహాయంతో చల్లార్చి అదనంగా నీటిని తీసుకువచ్చి అక్కడ మంటకు పూర్తిగా ఆర్పివేయడం జరిగింది. ఈ ప్రమాదంలో నష్టం సుమారు 20000 రూపాయలు ఉండవచ్చునని యజమాని తెలియజేయడం జరిగింది. ఈ ప్రమాదం నందు పుంగనూరు అగ్నిమాపక సిబ్బంది పాల్గొనడం జరిగినది.
ఇట్లు
ఎన్. సుబ్బరాజు
అగ్నిమాపక కేంద్రాధికారి
పుంగనూరు అగ్నిమాపక కేంద్రము