BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో విధ్వంసం.. 18 మంది అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 05:36 AM
93 వీక్షణలు

ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో విధ్వంసం.. 18 మంది అరెస్ట్

కర్నూలు నగరంలో ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్‌సీబీ విజయం అనంతరం నిర్వహించిన విజయోత్సవాలు కొందరి అత్యుత్సాహంతో విధ్వంసానికి దారితీశాయి. రాజ్ విహార్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులతో పాటు బస్సుల అద్దాలను ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలు, సోషల్ మీడియా వీడియోలు, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా ఘటనలో పాల్గొన్న 18 మందిని గుర్తించి అరెస్టు చేశారు.

అనంతరం వారిని కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు నడిరోడ్డుపై తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు.

ప్రభుత్వ, ప్రజా, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు. విజయోత్సవాలు, పండుగలు, ఇతర వేడుకలను శాంతియుతంగా నిర్వహించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.