BREAKING
ఏలూరు జిల్లాలో కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు ఏఎన్‌ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం మయన్మార్ అధ్యక్షుడితో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో విధ్వంసం.. 18 మంది అరెస్ట్ ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌పై రాజకీయ రచ్చ..! నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొన్న mla రాకేష్ రెడ్డి.. ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు ​తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏలూరు జిల్లాలో కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు ఏఎన్‌ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం మయన్మార్ అధ్యక్షుడితో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో విధ్వంసం.. 18 మంది అరెస్ట్ ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌పై రాజకీయ రచ్చ..! నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొన్న mla రాకేష్ రెడ్డి.. ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు ​తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
www.ntodaynews.com

ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో విధ్వంసం.. 18 మంది అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 05:36 AM
5 వీక్షణలు

ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో విధ్వంసం.. 18 మంది అరెస్ట్

కర్నూలు నగరంలో ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్‌సీబీ విజయం అనంతరం నిర్వహించిన విజయోత్సవాలు కొందరి అత్యుత్సాహంతో విధ్వంసానికి దారితీశాయి. రాజ్ విహార్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులతో పాటు బస్సుల అద్దాలను ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలు, సోషల్ మీడియా వీడియోలు, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా ఘటనలో పాల్గొన్న 18 మందిని గుర్తించి అరెస్టు చేశారు.

అనంతరం వారిని కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు నడిరోడ్డుపై తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు.

ప్రభుత్వ, ప్రజా, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు. విజయోత్సవాలు, పండుగలు, ఇతర వేడుకలను శాంతియుతంగా నిర్వహించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.