BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

అకాల వర్షాల మోత… రైతులకు భారీ నష్టం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 08:20 PM
172 వీక్షణలు

అకాల వర్షాల మోత… రైతులకు భారీ నష్టం – తక్షణ నష్టపరిహారం ఇవ్వాలి: డి. హరినాథ్ డిమాండ్

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట:

రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల ప్రభావంతో వరి సహా పలు వాణిజ్య పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, దీంతో రైతులు ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ ఆందోళన వ్యక్తం చేశారు.

విస్సన్నపేటలో మాట్లాడుతూ, లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట కోత దశకు చేరుకున్న సమయంలో తుఫాన్ ప్రభావంతో పంటలు నాశనం కావడం రైతులకు మానసికంగా కూడా తీవ్ర వేదన కలిగించిందన్నారు. వరి, మొక్కజొన్న, మామిడి, అరటి, మినుము, మిర్చి పంటలు వేల ఎకరాల్లో నష్టపోయినట్లు తెలిపారు.

ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని, ప్రతి రైతు పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి వెంటనే నష్టపరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణ సహాయంగా ఎకరాకు రూ.50 వేల చొప్పున ఇవ్వాలని, అలాగే రైతుల రుణాలను పూర్తిగా రద్దు చేయాలని హరినాథ్ కోరారు.