BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

అకాల వర్షాల మోత… రైతులకు భారీ నష్టం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 08:20 PM
140 వీక్షణలు

అకాల వర్షాల మోత… రైతులకు భారీ నష్టం – తక్షణ నష్టపరిహారం ఇవ్వాలి: డి. హరినాథ్ డిమాండ్

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట:

రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల ప్రభావంతో వరి సహా పలు వాణిజ్య పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, దీంతో రైతులు ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ ఆందోళన వ్యక్తం చేశారు.

విస్సన్నపేటలో మాట్లాడుతూ, లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట కోత దశకు చేరుకున్న సమయంలో తుఫాన్ ప్రభావంతో పంటలు నాశనం కావడం రైతులకు మానసికంగా కూడా తీవ్ర వేదన కలిగించిందన్నారు. వరి, మొక్కజొన్న, మామిడి, అరటి, మినుము, మిర్చి పంటలు వేల ఎకరాల్లో నష్టపోయినట్లు తెలిపారు.

ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని, ప్రతి రైతు పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి వెంటనే నష్టపరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణ సహాయంగా ఎకరాకు రూ.50 వేల చొప్పున ఇవ్వాలని, అలాగే రైతుల రుణాలను పూర్తిగా రద్దు చేయాలని హరినాథ్ కోరారు.