BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

అకాల వర్షాల మోత… రైతులకు భారీ నష్టం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 08:20 PM
121 వీక్షణలు

అకాల వర్షాల మోత… రైతులకు భారీ నష్టం – తక్షణ నష్టపరిహారం ఇవ్వాలి: డి. హరినాథ్ డిమాండ్

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట:

రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల ప్రభావంతో వరి సహా పలు వాణిజ్య పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, దీంతో రైతులు ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ ఆందోళన వ్యక్తం చేశారు.

విస్సన్నపేటలో మాట్లాడుతూ, లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట కోత దశకు చేరుకున్న సమయంలో తుఫాన్ ప్రభావంతో పంటలు నాశనం కావడం రైతులకు మానసికంగా కూడా తీవ్ర వేదన కలిగించిందన్నారు. వరి, మొక్కజొన్న, మామిడి, అరటి, మినుము, మిర్చి పంటలు వేల ఎకరాల్లో నష్టపోయినట్లు తెలిపారు.

ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని, ప్రతి రైతు పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి వెంటనే నష్టపరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణ సహాయంగా ఎకరాకు రూ.50 వేల చొప్పున ఇవ్వాలని, అలాగే రైతుల రుణాలను పూర్తిగా రద్దు చేయాలని హరినాథ్ కోరారు.