www.ntodaynews.com
అకౌంట్లలోకి రూ.13 వేలు.. ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 16, 17, 18 తేదీల్లో 'తల్లికి వందనం' పథకం నిధులను విడుదల చేయనుంది. అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.13 వేల చొప్పున జమ చేయనుంది.
ఈ పథకానికి మీరు అర్హులా కాదా అనేది bm-sgsw.ap.gov.in వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.
అలాగే ఈ పథకం కింద డబ్బులు పొందాలంటే ఆధార్ నంబర్ బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉండాలి. లింక్ కాకపోతే వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పూర్తి వివరాల కోసం స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలను సంప్రదించవచ్చు.