BREAKING
అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత వారం రోజుల్లోగా సభ్యత్వ నమోదు పూర్తి కౌన్సిలర్ జన్మదిన వేడుకలు లో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలంగాణ స్త్రీ నిధిలో 123 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. వికసిత్ భారత్ లక్ష్యాలకు తెలంగాణ భాగస్వామ్యం.. కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి శ్రీవారి ఆగస్టు నెల ఆర్జిత సేవా టికెట్ల విడుదల తేదీలు ఖరారు! ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి శ్రీనివాసపురంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఘనంగా జన్మదిన వేడుకలు బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు: మహిళా సంఘాల భారీ నిరసన జోసెఫ్ విజయ్ అను నేను... అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత వారం రోజుల్లోగా సభ్యత్వ నమోదు పూర్తి కౌన్సిలర్ జన్మదిన వేడుకలు లో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలంగాణ స్త్రీ నిధిలో 123 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. వికసిత్ భారత్ లక్ష్యాలకు తెలంగాణ భాగస్వామ్యం.. కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి శ్రీవారి ఆగస్టు నెల ఆర్జిత సేవా టికెట్ల విడుదల తేదీలు ఖరారు! ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి శ్రీనివాసపురంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఘనంగా జన్మదిన వేడుకలు బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు: మహిళా సంఘాల భారీ నిరసన జోసెఫ్ విజయ్ అను నేను...
www.ntodaynews.com

అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత

తెలంగాణ
/ నల్గొండ / కొండమల్లేపల్లి
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
10 May, 2026 - 08:53 PM
11 వీక్షణలు

NTODAY NEWS కొండమల్లేపల్లి

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో అక్రమంగా, క్రూరంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో కొండమల్లేపల్లి ఎస్సై తన సిబ్బందితో కలిసి గ్రామంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అశోక్ లేలాండ్ వాహనం (టి ఎస్ 05యు సి 2066) అనుమానాస్పదంగా కనిపించడంతో దానిని ఆపి తనిఖీ చేశారు. వాహనంలో నాలుగు పశువులను అత్యంత క్రూరంగా, ఇరుకైన చోట తాళ్లతో కట్టివేసి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆ పశువులకు కనీసం నీరు, ఆహారం కూడా అందించకుండా హింసిస్తూ రవాణా చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాహన డ్రైవర్ బొమ్మకంటి రాములు (తండ్రి: తిరుపతయ్య, గ్రామం: చింతపల్లి) మరియు పశువుల యజమాని జంగయ్య (గ్రామం: పోలెపల్లి) పై పోలీసులు కేసు నమోదు చేశారు. రక్షించిన నాలుగు పశువులను సంరక్షణ నిమిత్తం చింతపల్లిలోని శ్రీ సాయి కృష్ణ గోశాలకు తరలించారు.

నిబంధనలకు విరుద్ధంగా పశువులను హింసిస్తూ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.