BREAKING
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం
www.ntodaynews.com

అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత

తెలంగాణ
/ నల్గొండ / కొండమల్లేపల్లి
10 May, 2026 - 08:53 PM
155 వీక్షణలు

NTODAY NEWS కొండమల్లేపల్లి

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో అక్రమంగా, క్రూరంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో కొండమల్లేపల్లి ఎస్సై తన సిబ్బందితో కలిసి గ్రామంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అశోక్ లేలాండ్ వాహనం (టి ఎస్ 05యు సి 2066) అనుమానాస్పదంగా కనిపించడంతో దానిని ఆపి తనిఖీ చేశారు. వాహనంలో నాలుగు పశువులను అత్యంత క్రూరంగా, ఇరుకైన చోట తాళ్లతో కట్టివేసి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆ పశువులకు కనీసం నీరు, ఆహారం కూడా అందించకుండా హింసిస్తూ రవాణా చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాహన డ్రైవర్ బొమ్మకంటి రాములు (తండ్రి: తిరుపతయ్య, గ్రామం: చింతపల్లి) మరియు పశువుల యజమాని జంగయ్య (గ్రామం: పోలెపల్లి) పై పోలీసులు కేసు నమోదు చేశారు. రక్షించిన నాలుగు పశువులను సంరక్షణ నిమిత్తం చింతపల్లిలోని శ్రీ సాయి కృష్ణ గోశాలకు తరలించారు.

నిబంధనలకు విరుద్ధంగా పశువులను హింసిస్తూ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.