BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత

తెలంగాణ
/ నల్గొండ / కొండమల్లేపల్లి
10 May, 2026 - 08:53 PM
233 వీక్షణలు

NTODAY NEWS కొండమల్లేపల్లి

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో అక్రమంగా, క్రూరంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో కొండమల్లేపల్లి ఎస్సై తన సిబ్బందితో కలిసి గ్రామంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అశోక్ లేలాండ్ వాహనం (టి ఎస్ 05యు సి 2066) అనుమానాస్పదంగా కనిపించడంతో దానిని ఆపి తనిఖీ చేశారు. వాహనంలో నాలుగు పశువులను అత్యంత క్రూరంగా, ఇరుకైన చోట తాళ్లతో కట్టివేసి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆ పశువులకు కనీసం నీరు, ఆహారం కూడా అందించకుండా హింసిస్తూ రవాణా చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాహన డ్రైవర్ బొమ్మకంటి రాములు (తండ్రి: తిరుపతయ్య, గ్రామం: చింతపల్లి) మరియు పశువుల యజమాని జంగయ్య (గ్రామం: పోలెపల్లి) పై పోలీసులు కేసు నమోదు చేశారు. రక్షించిన నాలుగు పశువులను సంరక్షణ నిమిత్తం చింతపల్లిలోని శ్రీ సాయి కృష్ణ గోశాలకు తరలించారు.

నిబంధనలకు విరుద్ధంగా పశువులను హింసిస్తూ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.