www.ntodaynews.com
భూ భారతి చట్టంపై అవగాహన సదస్సును రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి
తెలంగాణ
మండలంలో నిర్వహించే భూ భారతి చట్టంపై అవగాహన సదస్సును రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి-- తహసిల్దార్ పి. శ్రీనివాసరావు
NTODAY NEWS: బొమ్మలరామారం మండలం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన తెలంగాణ భూ భారతి (భూమి హక్కుల రికార్డు) చట్టం -2025 పై అవగాహన కార్యక్రమం సోమవారం రోజున ఉదయం 9 గంటలకి తాహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది అని తహసిల్దార్ పి. శ్రీనివాసరావు నేడు ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్,ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మరియు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ యం.హనుమంతరావు, వివిధ శాఖల అధికారులు హాజరుకానున్నారు అని తెలిపారు కావున బొమ్మలరామారం మండలంలోని రైతులు అందరూ అవగాహన సదస్సుకు పాల్గొని భూభారతి (భూమి హక్కుల రికార్డు చట్టం- 2025) నియమ నిబంధనలను, వాటిని అమలుపరిచే విధివిధానాలను తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అని అన్నారు కావున మండలంలోని ప్రతి రైతు అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube