BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

ఘనంగా అమరావతి రాజధాని సంబరాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 07:23 AM
98 వీక్షణలు

అమరావతి రాజధాని సంబరాలు ఘనంగా – జనార్ధనవరం గ్రామంలో కొవ్వొత్తులతో ఆనందోత్సాహం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు మాదాసు చిన్న పుల్లయ్య మరియు మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని సంబరాలు కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించడం ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు నెరవేరిన శుభసందర్భమని తెలిపారు. అమరావతి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారి, భవిష్యత్తులో ప్రపంచ స్థాయి నగరంగా ఎదగాలని ఆకాంక్షించారు.

అమరావతి నిర్మాణంతో యువతకు విస్తృతంగా ఉద్యోగావకాశాలు కలుగుతాయని, పెట్టుబడులు పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వం తీసుకున్న కృషిని వారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామంలోని టిడిపి నాయకులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.