BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఘనంగా అమరావతి రాజధాని సంబరాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 07:23 AM
169 వీక్షణలు

అమరావతి రాజధాని సంబరాలు ఘనంగా – జనార్ధనవరం గ్రామంలో కొవ్వొత్తులతో ఆనందోత్సాహం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు మాదాసు చిన్న పుల్లయ్య మరియు మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని సంబరాలు కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించడం ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు నెరవేరిన శుభసందర్భమని తెలిపారు. అమరావతి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారి, భవిష్యత్తులో ప్రపంచ స్థాయి నగరంగా ఎదగాలని ఆకాంక్షించారు.

అమరావతి నిర్మాణంతో యువతకు విస్తృతంగా ఉద్యోగావకాశాలు కలుగుతాయని, పెట్టుబడులు పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వం తీసుకున్న కృషిని వారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామంలోని టిడిపి నాయకులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.