BREAKING
ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ
www.ntodaynews.com

ఘనంగా అమరావతి రాజధాని సంబరాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 07:23 AM
127 వీక్షణలు

అమరావతి రాజధాని సంబరాలు ఘనంగా – జనార్ధనవరం గ్రామంలో కొవ్వొత్తులతో ఆనందోత్సాహం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు మాదాసు చిన్న పుల్లయ్య మరియు మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని సంబరాలు కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించడం ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు నెరవేరిన శుభసందర్భమని తెలిపారు. అమరావతి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారి, భవిష్యత్తులో ప్రపంచ స్థాయి నగరంగా ఎదగాలని ఆకాంక్షించారు.

అమరావతి నిర్మాణంతో యువతకు విస్తృతంగా ఉద్యోగావకాశాలు కలుగుతాయని, పెట్టుబడులు పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వం తీసుకున్న కృషిని వారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామంలోని టిడిపి నాయకులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.