BREAKING
ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి* ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి*
www.ntodaynews.com

ఘనంగా అమరావతి రాజధాని సంబరాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 07:23 AM
128 వీక్షణలు

అమరావతి రాజధాని సంబరాలు ఘనంగా – జనార్ధనవరం గ్రామంలో కొవ్వొత్తులతో ఆనందోత్సాహం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు మాదాసు చిన్న పుల్లయ్య మరియు మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని సంబరాలు కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించడం ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు నెరవేరిన శుభసందర్భమని తెలిపారు. అమరావతి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారి, భవిష్యత్తులో ప్రపంచ స్థాయి నగరంగా ఎదగాలని ఆకాంక్షించారు.

అమరావతి నిర్మాణంతో యువతకు విస్తృతంగా ఉద్యోగావకాశాలు కలుగుతాయని, పెట్టుబడులు పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వం తీసుకున్న కృషిని వారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామంలోని టిడిపి నాయకులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.