అమరావతి: స్థానిక ఎన్నికలకు జనసేన సమర సన్నద్ధం.. కమిటీలకు ఓరియంటేషన్
అమరావతిలో ఇవాళ జనసేన స్థానిక సంస్థల ఎన్నికల కమిటీకి ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో స్థానిక ఎన్నికలకు జనసైనికులు, వీర మహిళలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం, ఎన్నికల వ్యూహం, క్షేత్రస్థాయి కార్యాచరణపై కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్తో పాటు ముగ్గురు సభ్యులను నియమించనున్నారు. ఈ కమిటీలు స్థానికంగా పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేస్తూ, ఎన్నికల సన్నద్ధతను వేగవంతం చేయనున్నాయి. దీంతో స్థానిక ఎన్నికలపై జనసేనలో రాజకీయ సందడి మరింత పెరగనుంది.