వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ గణేష్ ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి..గణేష్ చతుర్థి వేడుకల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్ని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, మరింత వైభవంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. వినాయక మండపాల వద్ద విద్యుత్ అవసరాల కోసం నిర్వాహకులు ఇబ్బందులు పడకుండా ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించే గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వ నిర్ణయం భక్తుల్లో ఆనందం నింపింది. ప్రతి మండపం వద్ద ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తి వాతావరణంలో జరిగేలా అవసరమైన సహకారం అందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
“విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలి” అని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు.