అమరావతి: వినాయక మండపాల అనుమతులకు ఈ-పోర్టల్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
ఆంధ్రప్రదేశ్
అమరావతి: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులకు ఆన్లైన్లో అనుమతులు మంజూరు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ప్రత్యేక సింగిల్ విండో ఈ-పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మండపాల ఏర్పాటుకు అవసరమైన వివిధ శాఖల అనుమతులను పొందేందుకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా www.ganeshutsav.net ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు.
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిర్వాహకులకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. మండపాల ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను పారదర్శకంగా, సులభతరంగా పూర్తి చేసుకునేందుకు ఈ-పోర్టల్ను వినియోగించుకోవాలని సూచించారు.