BREAKING
ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు
Date of Publish : 04 September 2026, 01:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక భేటీ...

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Sep, 2026 - 01:00 PM
10 వీక్షణలు

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక భేటీ.. కూటమి గెలుపే లక్ష్యంగా వ్యూహరచన

స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కూటమి గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని సూచించారు.

భాగస్వామ్య పార్టీలతో సమన్వయం చేసుకుంటూ స్థానిక ఎన్నికలను ఎదుర్కోవాలని నేతలకు స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమన్వయం చేసి ఎన్నికల సన్నద్ధతను వేగవంతం చేయాలని సూచించారు.

అభ్యర్థుల ఎంపికలో యువత, మహిళలకు ప్రాధాన్యం

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజల్లో మంచి పేరు ఉన్న సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేయాలని తెలిపారు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. అవసరమైతే బీసీలకు మరిన్ని సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించాలన్న లక్ష్యంతో నిర్ణయాలు తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు.

కూటమి భాగస్వామ్య పక్షాలతో సమన్వయం, సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించి స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.