www.ntodaynews.com
అమరావతిలో సీఎం 7వ ఉన్నతస్థాయి సదస్సు.. పాల్గొన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ..
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అమరావతిలో సీఎం 7వ ఉన్నతస్థాయి సదస్సు.. పాల్గొన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ..
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్ మరియు ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రా అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 7వ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో అన్నమయ్య జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శుక్రవారం రెండో రోజు జరిగిన ఈ కీలక సమావేశానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్ , జిల్లా ఎస్సీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపిఎస్ హాజరయ్యారు.
ఈ సదస్సులో భాగంగా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పధకాల పురోగతి, అలాగే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తీసుకుంటున్న పటిష్టమైన భద్రతా చర్యలు, శాంతిభద్రతల పరిస్థితుల గురించి ప్రభుత్వానికి నివేదించారు.
పాలనాపరమైన సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో, నేరాల నియంత్రణలో జిల్లా యంత్రాంగం అనుసరిస్తున్న విధానాలను ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ఎస్పీ సమావేశం దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యమంత్రి దిశానిర్దేశం:
రాష్ట్ర వ్యాప్త అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలు, మరియు శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉన్నతాధికారులకు పలు కీలక సూచనలు, దిశానిర్దేశం చేశారు.