BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

అంబటి లాయర్ ఎంట్రీతో పొన్నవోలుకు చెక్…

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 06:06 AM
85 వీక్షణలు

అంబటి లాయర్ ఎంట్రీతో పొన్నవోలుకు చెక్… వైసీపీ లీగల్ సెల్‌లో కొత్త పవర్ ఫైట్ 

వైసీపీలో అంతర్గత లీగల్ పోరు ఆసక్తికరంగా మారింది. అంబటి రాంబాబు తన కేసులో స్వయంగా వాదించేందుకు ముందుకు రావడం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హైకోర్టుకు నల్లకోటు వేసుకుని వెళ్లి, పిటిషన్ కూడా తానే తయారు చేసుకోవడం ఆయన దూకుడును చూపిస్తోంది.

ఇప్పటివరకు పార్టీ తరఫున కీలక లీగల్ ఫేస్‌గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డిను ఈసారి పూర్తిగా పక్కన పెట్టడం మరింత చర్చకు దారితీసింది. గతంలో అంబటి అరెస్టు సమయంలో పొన్నవోలు కోర్టులో బలంగా వాదించగా, ఇప్పుడు మాత్రం అంబటి “నా కేసు నేనే చూసుకుంటా” అంటూ స్వయంగా రంగంలోకి దిగడం రాజకీయ సంకేతంగా భావిస్తున్నారు.

పార్టీలో ఇది కేవలం ఒక కేసు వ్యవహారం కాకుండా, లీగల్ సెల్‌లో ఆధిపత్య పోరుగా మారిందనే అభిప్రాయం వినిపిస్తోంది. సీనియర్ లాయర్లను కూడా పక్కన పెట్టి అంబటి సోలోగా ముందుకు రావడం, వైసీపీలో కొత్త పవర్ సెంటర్‌గా ఎదగాలనే ప్రయత్నంగా విశ్లేషిస్తున్నారు.

ఓటమి తర్వాత పార్టీ సెకండ్ లైన్ నాయకులు చాలామంది సైలెంట్‌గా ఉన్న సమయంలో, అంబటి మాత్రం కోర్టు-రాజకీయాల్లో ఒకేసారి యాక్టివ్‌గా ఉండటం గమనార్హం. దీంతో భవిష్యత్తులో పార్టీ లీగల్ వ్యవహారాల్లో ఆయన పాత్ర మరింత పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి.

అయితే, ఈ పరిణామం వల్ల పొన్నవోలు వర్గంలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి, అంబటి తీసుకున్న ఈ నిర్ణయం వైసీపీలో లీగల్ లీడర్‌షిప్‌పై కొత్త సమీకరణాలకు దారి తీసేలా కనిపిస్తోంది.