BREAKING
గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
Date of Publish : 19 March 2026, 06:06 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అంబటి లాయర్ ఎంట్రీతో పొన్నవోలుకు చెక్…

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 06:06 AM
151 వీక్షణలు

అంబటి లాయర్ ఎంట్రీతో పొన్నవోలుకు చెక్… వైసీపీ లీగల్ సెల్‌లో కొత్త పవర్ ఫైట్ 

వైసీపీలో అంతర్గత లీగల్ పోరు ఆసక్తికరంగా మారింది. అంబటి రాంబాబు తన కేసులో స్వయంగా వాదించేందుకు ముందుకు రావడం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హైకోర్టుకు నల్లకోటు వేసుకుని వెళ్లి, పిటిషన్ కూడా తానే తయారు చేసుకోవడం ఆయన దూకుడును చూపిస్తోంది.

ఇప్పటివరకు పార్టీ తరఫున కీలక లీగల్ ఫేస్‌గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డిను ఈసారి పూర్తిగా పక్కన పెట్టడం మరింత చర్చకు దారితీసింది. గతంలో అంబటి అరెస్టు సమయంలో పొన్నవోలు కోర్టులో బలంగా వాదించగా, ఇప్పుడు మాత్రం అంబటి “నా కేసు నేనే చూసుకుంటా” అంటూ స్వయంగా రంగంలోకి దిగడం రాజకీయ సంకేతంగా భావిస్తున్నారు.

పార్టీలో ఇది కేవలం ఒక కేసు వ్యవహారం కాకుండా, లీగల్ సెల్‌లో ఆధిపత్య పోరుగా మారిందనే అభిప్రాయం వినిపిస్తోంది. సీనియర్ లాయర్లను కూడా పక్కన పెట్టి అంబటి సోలోగా ముందుకు రావడం, వైసీపీలో కొత్త పవర్ సెంటర్‌గా ఎదగాలనే ప్రయత్నంగా విశ్లేషిస్తున్నారు.

ఓటమి తర్వాత పార్టీ సెకండ్ లైన్ నాయకులు చాలామంది సైలెంట్‌గా ఉన్న సమయంలో, అంబటి మాత్రం కోర్టు-రాజకీయాల్లో ఒకేసారి యాక్టివ్‌గా ఉండటం గమనార్హం. దీంతో భవిష్యత్తులో పార్టీ లీగల్ వ్యవహారాల్లో ఆయన పాత్ర మరింత పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి.

అయితే, ఈ పరిణామం వల్ల పొన్నవోలు వర్గంలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి, అంబటి తీసుకున్న ఈ నిర్ణయం వైసీపీలో లీగల్ లీడర్‌షిప్‌పై కొత్త సమీకరణాలకు దారి తీసేలా కనిపిస్తోంది.