BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

అంబటి లాయర్ ఎంట్రీతో పొన్నవోలుకు చెక్…

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 06:06 AM
53 వీక్షణలు

అంబటి లాయర్ ఎంట్రీతో పొన్నవోలుకు చెక్… వైసీపీ లీగల్ సెల్‌లో కొత్త పవర్ ఫైట్ 

వైసీపీలో అంతర్గత లీగల్ పోరు ఆసక్తికరంగా మారింది. అంబటి రాంబాబు తన కేసులో స్వయంగా వాదించేందుకు ముందుకు రావడం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హైకోర్టుకు నల్లకోటు వేసుకుని వెళ్లి, పిటిషన్ కూడా తానే తయారు చేసుకోవడం ఆయన దూకుడును చూపిస్తోంది.

ఇప్పటివరకు పార్టీ తరఫున కీలక లీగల్ ఫేస్‌గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డిను ఈసారి పూర్తిగా పక్కన పెట్టడం మరింత చర్చకు దారితీసింది. గతంలో అంబటి అరెస్టు సమయంలో పొన్నవోలు కోర్టులో బలంగా వాదించగా, ఇప్పుడు మాత్రం అంబటి “నా కేసు నేనే చూసుకుంటా” అంటూ స్వయంగా రంగంలోకి దిగడం రాజకీయ సంకేతంగా భావిస్తున్నారు.

పార్టీలో ఇది కేవలం ఒక కేసు వ్యవహారం కాకుండా, లీగల్ సెల్‌లో ఆధిపత్య పోరుగా మారిందనే అభిప్రాయం వినిపిస్తోంది. సీనియర్ లాయర్లను కూడా పక్కన పెట్టి అంబటి సోలోగా ముందుకు రావడం, వైసీపీలో కొత్త పవర్ సెంటర్‌గా ఎదగాలనే ప్రయత్నంగా విశ్లేషిస్తున్నారు.

ఓటమి తర్వాత పార్టీ సెకండ్ లైన్ నాయకులు చాలామంది సైలెంట్‌గా ఉన్న సమయంలో, అంబటి మాత్రం కోర్టు-రాజకీయాల్లో ఒకేసారి యాక్టివ్‌గా ఉండటం గమనార్హం. దీంతో భవిష్యత్తులో పార్టీ లీగల్ వ్యవహారాల్లో ఆయన పాత్ర మరింత పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి.

అయితే, ఈ పరిణామం వల్ల పొన్నవోలు వర్గంలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి, అంబటి తీసుకున్న ఈ నిర్ణయం వైసీపీలో లీగల్ లీడర్‌షిప్‌పై కొత్త సమీకరణాలకు దారి తీసేలా కనిపిస్తోంది.