BREAKING
జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
www.ntodaynews.com

అనకాపల్లిలో పోలీస్ ట్రాన్సిట్ ఫెసిలిటీ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
02 May, 2026 - 01:43 PM
9 వీక్షణలు

అనకాపల్లిలో 'పోలీస్ ట్రాన్సిట్ ఫెసిలిటీ' ప్రారంభం – పాల్గొన్న ఐజీ, కలెక్టర్ మరియు ఎస్పీ 

​ అనకాపల్లి పట్టణం, మే 01, 2026: అనకాపల్లి జిల్లా కేంద్రంలో పోలీస్ అధికారుల సౌకర్యార్థం అత్యాధునిక వసతులతో నిర్మించిన 'పోలీస్ ట్రాన్సిట్ ఫెసిలిటీ' భవనాన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (AMNS) సంస్థ తమ సామాజిక బాధ్యత (CSR) నిధులతో నిర్మించిన ఈ భవనాన్ని విశాఖపట్నం రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్ , జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణ, ఐఏఎస్  మరియు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ సంయుక్తంగా ప్రారంభించారు.

​విశాఖ రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్  మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడిన జిల్లాలో మౌలిక వసతుల కల్పన దిశగా ఇది ఒక మంచి పరిణామమని పేర్కొన్నారు. విధుల్లో భాగంగా జిల్లాకు వచ్చే అధికారులకు ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఇందుకు సహకరించిన AMNS యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీమతి విజయ కృష్ణన్, ఐఏఎస్  మాట్లాడుతూ, అభివృద్ధి కార్యక్రమాల్లో కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం ప్రశంసనీయమని, పోలీస్ యంత్రాంగానికి మెరుగైన వసతులు కల్పించడం ద్వారా వారి సేవల సామర్థ్యం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

​శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్  మాట్లాడుతూ, జిల్లా పోలీసుల సంక్షేమం మరియు పనితీరు మెరుగుపరచడానికి ఇలాంటి వసతులు దోహదపడతాయని తెలిపారు. పోలీస్ శాఖకు నిరంతరం సహకారం అందిస్తున్న అధికారులకు మరియు సంస్థలకు ధన్యవాదాలు తెలియజేశారు.

​​ఈ కార్యక్రమంలో East AMNS చీఫ్ ప్రాజెక్ట్స్ శ్రీ కె.ఏ.చౌదరి వారి సహధర్మ చారిణితో  పాల్గొని, సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లా అభివృద్ధికి తమ సంస్థ ఎల్లప్పుడూ తోడ్పాటునందిస్తుందని తెలిపారు.

వీరితో పాటు అడిషనల్ ఎస్పీ (క్రైమ్స్) శ్రీ ఎల్.మోహన్ రావు, ఎస్.బి డీఎస్పీ శ్రీ జీ.ఆర్.ఆర్.మోహన్, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీమతి కె.శ్రావణి, ఇన్స్పెక్టర్లు బాల సూర్యరావు, జి.ప్రేమ్ కుమార్, జి.అశోక్ కుమార్, ఎం.వెంకటనారాయణ, మరియు ఐటీ కోర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.