BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

తాడిపత్రిలో ప్రైవేట్ పాఠశాలల బస్సులపై రవాణా శాఖ అధికారుల తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 11:46 AM
60 వీక్షణలు

నిబంధనలు పాటించని పలు బస్సులకు జరిమానా

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రైవేట్ పాఠశాలల బస్సులపై రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా చేపట్టిన ఈ తనిఖీల్లో పలు బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించారు.

బస్సుల్లో అత్యవసర ద్వారాలు, ఫస్ట్‌ఎయిడ్‌ కిట్లు, ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు, వాహనాల ఫిట్‌నెస్‌, బీమా, డ్రైవర్ల లైసెన్సులు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. తనిఖీల సందర్భంగా కొన్ని బస్సుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, అవసరమైన పత్రాలు లేకపోవడం వంటి లోపాలు వెలుగుచూశాయి.

నిబంధనలు ఉల్లంఘించిన బస్సుల యాజమాన్యాలపై రవాణా శాఖ అధికారులు జరిమానాలు విధించారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, అన్ని పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు హెచ్చరించారు.

రానున్న రోజుల్లో కూడా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు.