BREAKING
తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఆగస్టు 9 ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని జయప్రదం చేయండి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరిగిన జైలు భరో ను జయప్రదం చేద్దాం - citu జాతీయ చేనేత దినోత్సవం నేడు ఇకత్ ను దరిద్దాం చేనేతను ఆదరిద్దాం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఆగస్టు 9 ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని జయప్రదం చేయండి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరిగిన జైలు భరో ను జయప్రదం చేద్దాం - citu జాతీయ చేనేత దినోత్సవం నేడు ఇకత్ ను దరిద్దాం చేనేతను ఆదరిద్దాం
www.ntodaynews.com

అనంతపురం జిల్లాలో మరో ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Aug, 2026 - 10:47 AM
3 వీక్షణలు

అనంతపురం జిల్లాలో మరో ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం వ్యాన్‌ను ఢీకొని కల్వర్టులోకి దూసుకెళ్లిన బస్సు.. 20 మందికి గాయాలు డ్రైవర్ పరిస్థితి విషమం

అనంతపురం: జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురైంది. పామిడి మండలం పొగరూరు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది గాయపడ్డారు. వీరిలో కొందరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

పొగరూరు సమీపంలో ప్రయాణిస్తున్న ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి ముందుగా ఓ వ్యాన్‌ను ఢీకొట్టింది. అనంతరం అదుపు కోల్పోయిన బస్సు రోడ్డు పక్కన ఉన్న కల్వర్టులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో పలువురు ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది.

ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలైనట్లు, పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన ప్రయాణికులను స్థానికుల సహాయంతో బయటకు తీసి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంతో రహదారిపై కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, క్షతగాత్రుల పరిస్థితిపై మరింత సమాచారం పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.