BREAKING
కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
Date of Publish : 09 September 2026, 07:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అన్నమయ్య జిల్లా : 19 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Sep, 2026 - 07:20 PM
12 వీక్షణలు

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 19 మంది సివిల్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన సిబ్బంది జిల్లా పోలీసు అధికారి ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్, అదనపు పోలీసు అధికారి ఎం. వెంకటాద్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారి మాట్లాడుతూ.. పదోన్నతితో పాటు కేసుల ప్రాథమిక దర్యాప్తు నిర్వహించే అధికారాలు కూడా లభిస్తాయని తెలిపారు. దీంతో పదోన్నతి పొందిన సిబ్బందిపై బాధ్యతలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. అప్పగించిన విధులను పూర్తి జవాబుదారీతనంతో నిర్వర్తించాలని సూచించారు.

ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ పోలీసు శాఖపై నమ్మకం మరింత పెరిగేలా విధులు నిర్వహించాలని సూచించారు. తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని పదోన్నతి పొందిన సిబ్బందికి తెలిపారు.

ఈ సందర్భంగా అధికారులు పదోన్నతి పొందిన 19 మంది హెడ్ కానిస్టేబుళ్లకు అభినందనలు తెలియజేశారు.