అన్నమయ్య జిల్లా కలెక్టర్ను కలిసిన జనసేన నేత సి.వి. గంగాధర్.. జనవాణి వినతుల సమర్పణ
అన్నమయ్య జిల్లా | NTODAY NEWS
జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం ద్వారా పుంగనూరు నియోజకవర్గ ప్రజల నుంచి స్వీకరించిన వినతిపత్రాలు, సమస్యలను జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ సి.వి. గంగాధర్ (చిన్నా) అన్నమయ్య జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి సమర్పించారు.
ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఆయన, వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ పుంగనూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని సి.వి. గంగాధర్ తెలిపారు.
ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి, సంబంధిత శాఖల ద్వారా పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు ఆయన వెల్లడించారు.