APWJF, APBJA ఆధ్వర్యంలో జర్నలిస్టులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన..
APWJF, APBJA ఆధ్వర్యంలో జర్నలిస్టులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన..
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు, మదనపల్లి, చౌడేపల్లి ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొని, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతూ వినతిపత్రాన్ని అధికారులకు సమర్పించారు.అక్రిడిటేషన్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉచిత విద్య అందించాలని APWJF, APBJA ఆధ్వర్యంలో జర్నలిస్టులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేసి, విద్య, గృహ వసతి వంటి సమస్యలను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు.ఇటీవల జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
వార్తల సేకరణలో ఉన్న మీడియా ప్రతినిధుల భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
భయభ్రాంతులకు గురికాకుండా జర్నలిస్టులు తమ విధులు నిర్వర్తించేలా సురక్షిత వాతావరణాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.