www.ntodaynews.com
అరుణాచలం మోక్ష ద్వారం వద్ద విషాదం.. తెలుగు భక్తుడు మృతి
జాతీయం
అరుణాచలం మోక్ష ద్వారం వద్ద విషాదం.. తెలుగు భక్తుడు మృతి
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన మణికుమార్ కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులోని అరుణాచల క్షేత్రానికి దర్శనానికి వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గిరి ప్రదక్షిణ మార్గంలోని మోక్ష ద్వారం వద్ద శరీర బరువు కారణంగా ఇరుక్కుపోయి బయటకు రాలేకపోయారు. దీంతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.
కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు ఎంతో శ్రమించి మణికుమార్ను బయటకు తీసుకొచ్చారు. అనంతరం అంబులెన్స్లో సమీప ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు స్థానిక అధికారుల విచారణలో వెల్లడికానున్నాయి.