BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 08 September 2026, 06:42 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఇకపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకలు

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
08 Sep, 2026 - 06:42 PM
5 వీక్షణలు

న్యూఢిల్లీ: జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవ వేదికను ఇకపై ఢిల్లీకి మాత్రమే పరిమితం చేయబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం దేశంలోని ఒక్కో ప్రాంతంలో జాతీయ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

ఈ ఏడాది నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఢిల్లీ నుంచి గుజరాత్‌కు మారనుంది. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో ఈ నెల 22న కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సినీ కళాకారులు, సాంకేతిక నిపుణులు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.

జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకను దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం ద్వారా సినీ రంగానికి చెందిన ప్రతిభావంతులను, కళాకారులను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ ఐక్యతను చాటేలా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్రం పేర్కొంది.