BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయం పై అవగాహన కార్యక్రమం

తెలంగాణ
04 Dec, 2025 - 10:06 AM
259 వీక్షణలు

పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయం పై అవగాహన కార్యక్రమం

NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాలోని మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల లో బాగంగా బొమ్మలరామారం, ఆలేరు, ఆత్మకూరు, రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయం పై అవగాహన కార్యక్రమం వివిధ మండలాలలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎన్నికల వయ్య పరిశీలకులు ఎం.శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరైనారు.ఈ మేరకు జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎం. శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఎన్నికల ప్రచార ఖర్చులను, పోటీ చేసే అభ్యర్థులు పకడ్బందీగా స్పష్టంగా నమోదు చేయాలన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు పూర్తి ఖర్చుల రికార్డులతో వ్యయ పరిశీలనకులనకు తప్పనిసరిగా హాజరు కావాల్సింది ఉంటుందన్నారు. 5 వేలకు పైగా జనాభా గల గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గరిష్ట వ్యయ పరిమితి రెండు లక్షల 50 వేలు, వార్డు మెంబర్ కు 50 వేలు వ్యయ పరిమితి గలదని అలాగే 5 వేల లోపు జనాభా గల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గరిష్ట వ్యయ పరిమితి 1.50 లక్షలు,వార్డు మెంబర్ కు 30 వేలు మాత్రమేనని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచార నిమిత్తం ఉపయోగించే వాహనాలను స్థానిక తహసిల్దార్/ రిటర్నింగ్ అధికారి దగ్గర తప్పనిసరిగా అనుమతి పొందాలని అనుమతి లేకుండా వినియోగించినట్లయితే ఎన్నికల నియమా నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఎన్నికలలో రోజువారి చేసిన ప్రచార ఖర్చులకు సంబంధించి ప్రతి పైసాను తమ ఖర్చుల ఖాతాలలో చూపించాలన్నారు.మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న మండలాలకు (బొమ్మలరామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు, ఆత్మకూర్,రాజాపేట) సంబంధించి డిసెంబర్ 6న మొదటి విడత,డిసెంబర్ 8న రెండో విడతగా రెండుసార్లు అభ్యర్థుల ఖర్చుల లెక్కలను పరిశీలిస్తారన్నారు. ఆయా లెక్కలన్నీ సంబంధిత మండల పరిషత్ అధికారి కార్యాలయంలో ఉదయం 10:00 నుండి 5 గంటల మధ్య పరిశీలిస్తారన్నారు. అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు ఎన్నికల కాక నిర్వహణ రిజిస్టర్ సంబంధిత డాక్యుమెంట్లో పరిశీలకుల ముందు ఆయా తేదీలలో తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. ఎన్నికల వ్యయ పరిశీలనకు హాజరుకాని అభ్యర్థికి నోటీసులు జారీ చేస్తామని, నోటీసులకు సరైన సంజాయిషీ లేనట్లయితే ఎన్నికల నియమా నిబంధన మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి , ఓడిపోయిన అభ్యర్థి ఎన్నికల ఫలితాల తరువాత 45 రోజుల్లో తుది వివరాలు తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు.పోటీ చేయు అభ్యర్థి ప్రచార సమయంలో తమ వద్ద రూ.1000/ కంటే ఎక్కువ సరైన ఆధారాలు లేకుండా ఉండడానికి వీలు లేదన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube