www.ntodaynews.com
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి NTODAY NEWS చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామన్నపేట మండలం ఇస్కిల్లా గ్రామానికి చెందిన పెన్నోజు ఉపేంద్ర చారి (49) మృతి చెందాడు. గురువారం చిట్యాల లో వివాహ వేడుకలకు హాజరై నల్గొండ కు వెళ్తూ చిట్యాల లోని సృజన థియేటర్ ఎదురుగా గల సర్వీస్ రోడ్డు వద్ద తన మోటార్ సైకిల్ ఏపీ 24 ఎన్ 7546 వాహనం మీద వెళుతూ మోటార్ సైకిల్ అదుపుతప్పి ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొనగా తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య పిన్నోజు రామేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల ఎస్సై రవికుమార్ తెలిపారు.