www.ntodaynews.com
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు హైకోర్టులో భారీ ఊరట
తెలంగాణ
/
హైదరాబాద్
సింగరేణి సంస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీయడంతో సింగరేణి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుమన్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిలును మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
సుమన్కు రూ. 25 వేల వ్యక్తిగత బాండ్తో పాటు, ఇద్దరి పూచీకత్తు సమర్పించాలనే నిబంధనపై హైకోర్టు ఈ బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విధించిన నిబంధనలకు కచ్చితంగా కట్టుబడి ఉండాలని, అలాగే తదుపరి దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా న్యాయస్థానం స్పష్టం చేసింది