www.ntodaynews.com
బీజేపీ జాతీయ కార్యవర్గంలో కీలక మార్పులు.. కొత్త బాధ్యతలు ప్రకటించిన అధిష్ఠానం
జాతీయం
ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. పార్టీలో కీలక పదవులకు పలువురు సీనియర్ నేతలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
కొత్త కార్యవర్గంలో 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులు కేటాయించారు. జాతీయ ఉపాధ్యక్షులుగా రాంమాధవ్, పురందేశ్వరి, వసుంధర రాజే తదితరులకు అవకాశం కల్పించారు.
మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు.
పీయూష్ గోయల్కు జాతీయ కోశాధికారి పదవి ఇచ్చారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) పదవిలో బీఎల్ సంతోష్ను మరోసారి కొనసాగించారు.
కొత్త జాతీయ కార్యవర్గం ద్వారా పార్టీ బలోపేతం, సంస్థాగత విస్తరణ, రాబోయే ఎన్నికలకు వ్యూహాత్మక ప్రణాళికలపై దృష్టి సారించనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.