ఢిల్లీ: 42 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన హత్య కేసు నిందితుడు
ఢిల్లీ: 42 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన హత్య కేసు నిందితుడు
1984లో ఢిల్లీలో జరిగిన ఓ హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు 42 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు. నాథులాల్ అనే వ్యక్తి అప్పట్లో కేసు నమోదైన తర్వాత పోలీసుల కంటపడకుండా తప్పించుకున్నాడు.
ఈ కేసులో మరో నిందితుడు అప్పుడే పట్టుబడినా.. నాథులాల్ మాత్రం ఆచూకీ లేకుండా పోయాడు. ఇటీవల ఢిల్లీ పోలీసులు పాత కేసు ఫైళ్లను తిరగదీసి మళ్లీ దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో నాథులాల్ ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు.
ఆగస్టు 18న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తన వివరాలు బయటపడకుండా ఉండేందుకు నాథులాల్ కూరగాయల మార్కెట్లలో చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవించాడని పోలీసులు తెలిపారు. ఇన్నేళ్లలో అతడు పెళ్లి కూడా చేసుకోలేదని వెల్లడించారు. 42 ఏళ్లుగా తప్పించుకుని తిరిగిన నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో పాత కేసు మళ్లీ చర్చనీయాంశమైంది.