BREAKING
రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు
www.ntodaynews.com

ఢిల్లీ: 42 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన హత్య కేసు నిందితుడు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 05:30 PM
15 వీక్షణలు

ఢిల్లీ: 42 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన హత్య కేసు నిందితుడు

1984లో ఢిల్లీలో జరిగిన ఓ హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు 42 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు. నాథులాల్ అనే వ్యక్తి అప్పట్లో కేసు నమోదైన తర్వాత పోలీసుల కంటపడకుండా తప్పించుకున్నాడు.

ఈ కేసులో మరో నిందితుడు అప్పుడే పట్టుబడినా.. నాథులాల్ మాత్రం ఆచూకీ లేకుండా పోయాడు. ఇటీవల ఢిల్లీ పోలీసులు పాత కేసు ఫైళ్లను తిరగదీసి మళ్లీ దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో నాథులాల్ ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు.

ఆగస్టు 18న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తన వివరాలు బయటపడకుండా ఉండేందుకు నాథులాల్ కూరగాయల మార్కెట్లలో చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవించాడని పోలీసులు తెలిపారు. ఇన్నేళ్లలో అతడు పెళ్లి కూడా చేసుకోలేదని వెల్లడించారు. 42 ఏళ్లుగా తప్పించుకుని తిరిగిన నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో పాత కేసు మళ్లీ చర్చనీయాంశమైంది.