BREAKING
చనుబండ విద్యార్థుల ఘనత.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి.. ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి చనుబండ విద్యార్థుల ఘనత.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి.. ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి
www.ntodaynews.com

బీసీల బడ్జెట్ దగా: మంచిర్యాలలో బడ్జెట్ ప్రతుల దహనం

తెలంగాణ
/ తెలంగాణ / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
22 Mar, 2026 - 04:36 PM
133 వీక్షణలు

బీసీల బడ్జెట్ దగా: మంచిర్యాలలో బడ్జెట్ ప్రతుల దహనం

మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని నిరసిస్తూ బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ మరియు ఇతర నేతలు మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కేవలం రూ. 12,511 కోట్లతో సరిపెట్టడం 56 శాతం ఉన్న బీసీ జనాభాను ఘోరంగా వంచించడమేనని మండిపడ్డారు. గత బడ్జెట్‌లలో రూ. 9 వేల కోట్లు, రూ. 11 వేల కోట్లు కేటాయించి బీసీల అభివృద్ధిని అణగదొక్కారని, తాము రూ. 50 వేల కోట్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం పెడచెవిన పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బడ్జెట్‌పై పునర్ సమీక్ష చేపట్టకపోతే బీసీ సమాజం ముందు కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టి ఎండగడతామని వారు తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, వేముల అశోక్, రామగిరి రాజన్న చారి, మహిళా నాయకురాలు పేరం అలేఖ్య, కొట్టే నటేశ్వర్, మంచెర్ల సదానందం, చంద్రగిరి చంద్రమౌళి తదితరులు పాల్గొని నిరసనను ఉధృతం చేశారు