BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

బీసీల బడ్జెట్ దగా: మంచిర్యాలలో బడ్జెట్ ప్రతుల దహనం

తెలంగాణ
/ తెలంగాణ / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
22 Mar, 2026 - 04:36 PM
107 వీక్షణలు

బీసీల బడ్జెట్ దగా: మంచిర్యాలలో బడ్జెట్ ప్రతుల దహనం

మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని నిరసిస్తూ బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ మరియు ఇతర నేతలు మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కేవలం రూ. 12,511 కోట్లతో సరిపెట్టడం 56 శాతం ఉన్న బీసీ జనాభాను ఘోరంగా వంచించడమేనని మండిపడ్డారు. గత బడ్జెట్‌లలో రూ. 9 వేల కోట్లు, రూ. 11 వేల కోట్లు కేటాయించి బీసీల అభివృద్ధిని అణగదొక్కారని, తాము రూ. 50 వేల కోట్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం పెడచెవిన పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బడ్జెట్‌పై పునర్ సమీక్ష చేపట్టకపోతే బీసీ సమాజం ముందు కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టి ఎండగడతామని వారు తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, వేముల అశోక్, రామగిరి రాజన్న చారి, మహిళా నాయకురాలు పేరం అలేఖ్య, కొట్టే నటేశ్వర్, మంచెర్ల సదానందం, చంద్రగిరి చంద్రమౌళి తదితరులు పాల్గొని నిరసనను ఉధృతం చేశారు