www.ntodaynews.com
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు: రామగుండం సీపీ
మహిళల భద్రతకే పోలీస్ శాఖ ప్రాధాన్యం: జూన్ 1 నుండి జూలై 1 వరకు ప్రత్యేక ఆంక్షలు అమలు
సాధారణ పౌరులు మరియు మహిళల దృష్టిలో ఉంచుకొని మంచిర్యాల జోన్ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఈ ఆంక్షలు జూన్ 1 నుంచి జూలై 1 వరకు అమల్లో ఉంటాయని, ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి ఈ గడువును మరింత పొడిగిస్తామని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి బహిరంగంగా మద్యం సేవించే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు ఉంటాయని సీపీ హెచ్చరించారు