బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హనుమకొండ జిల్లా పర్యటన
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హనుమకొండ జిల్లా పర్యటన
హనుమకొండ జిల్లా | Ntoday News
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సెప్టెంబర్ 2న హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు.
పర్యటనలో భాగంగా ఆయన ఉదయం 10 గంటలకు హనుమకొండ జిల్లాకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా కాజీపేట బాపూజీనగర్ బ్రిడ్జి వద్ద బీజేపీ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రామచందర్ రావుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నారు.
అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా పరకాలకు బయలుదేరనున్నట్లు బీజేపీ జిల్లా నాయకులు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు కోరారు.