www.ntodaynews.com
డిప్యూటీ తహసిల్దార్గా ఎంపికైన బండి సౌజన్య
తెలంగాణ
గ్రూప్-2లో విజయం: డిప్యూటీ తహసిల్దార్గా ఎంపికైన బండి సౌజన్యకు అభినందనలు
NTODAY NEWS: ఏలూరు
స్థానిక 44వ డివిజన్ రెల్లిపేటకు చెందిన బండి సౌజన్య గ్రూప్-2 పరీక్షలో తొలి ప్రయత్నంలోనే డిప్యూటీ తహసిల్దార్గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జాతీయ సీనియర్ దళిత నేత, అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పొలిమేర హరికృష్ణ ఆమెను అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, యువత నిరాశ, నిస్పృహలకు లోనవకుండా సౌజన్య వంటి విజయవంతమైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పేదరికం, వివక్ష వంటి సమస్యలను అధిగమించేందుకు విద్యే ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు. విద్య ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పుడు సమాజం వ్యక్తి కులాన్ని కాకుండా సాధించిన విజయాన్ని మాత్రమే గుర్తిస్తుందని అన్నారు.
సౌజన్య భవిష్యత్తులో ఐఏఎస్ సాధించాలని ఆకాంక్షిస్తూ ఆమెను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో జనసేన నాయకుడు జనపరెడ్డి తేజతో పాటు రెల్లిపేటకు చెందిన మహిళలు, నాయకులు మరియు ఇతరులు పాల్గొన్నారు.
#Group2Success #DeputyTahsildar #WomenAchievement #YouthInspiration #EducationEmpowers
Follow us on
Website
Facebook
Instagram
YouTube