BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

బొల్లేరు చెరువు సమీపంలో పెద్దపులి కలకలం.. అప్రమత్తమైన అటవీశాఖ

ఆంధ్రప్రదేశ్
/ తూర్పు గోదావరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 07:23 AM
30 వీక్షణలు

బొల్లేరు చెరువు సమీపంలో పెద్దపులి కలకలం.. అప్రమత్తమైన అటవీశాఖ

తూర్పుగోదావరి జిల్లాలో కరిచర్లగూడెం–గోపాలపురం గ్రామాల మధ్య బొల్లేరు చెరువు సమీపంలో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. నందిగూడెం అటవీ ప్రాంతం నుంచి తొక్కిరెడ్డిగూడెం, కరిచర్లగూడెం మీదుగా బొల్లేరు చెరువు పరిసరాలకు పెద్దపులి చేరినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.

మార్గమధ్యలో ఒక దూడను చంపి కొబ్బరి, కోకో తోటలోకి లాక్కెళ్లిన ఆనవాళ్లు కనిపించడంతో అధికారులు తోటను పూర్తిగా చుట్టుముట్టారు. పెద్దపులిని సురక్షితంగా బంధించేందుకు మత్తు ఇంజక్షన్, బోను, డ్రోన్ల సాయంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.

ఈ ఆపరేషన్‌లో శ్రీశైలం టైగర్ టీం, తూర్పుగోదావరి జిల్లా హనుమన్ టీంతో పాటు ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చిన సుమారు 60 మంది అటవీశాఖ సిబ్బంది ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా అధికారుల సూచనలు పాటించాలని అటవీశాఖ విజ్ఞప్తి చేసింది.