BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

బూరుగుగూడెం బాధిత కుటుంబానికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్.. రూ.1.50 లక్షల చెక్కు అందజేసిన మంత్రి కొలుసు పార్థసారథి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 05:38 PM
66 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడులోని మంత్రివర్యుల కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన వడ్లమూడి రామచంద్రరావుకు రూ.1.50 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కును రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు.

అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి ఈ సహాయం కొంత ఊరటనివ్వనుందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం అండగా నిలవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.

చెక్కు అందుకున్న వడ్లమూడి రామచంద్రరావు కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వానికి, మంత్రి కొలుసు పార్థసారథికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు జనసేన నాయకులు తుమ్మల జగన్, వెల్లంకి శ్రీమన్నారాయణ, పాశం నాగబాబు పాల్గొని బాధిత కుటుంబానికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. సీఎంఆర్ఎఫ్ వంటి సంక్షేమ కార్యక్రమాలు ఆపదలో ఉన్న కుటుంబాలకు పెద్ద దిక్సూచిగా నిలుస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు.