BREAKING
పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చిన్మయ మిషన్ 75 సంవత్సరాల చిన్మయ అమృత మహోత్సవాలు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చిన్మయ మిషన్ 75 సంవత్సరాల చిన్మయ అమృత మహోత్సవాలు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్!
www.ntodaynews.com

బూరుగుగూడెం బాధిత కుటుంబానికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్.. రూ.1.50 లక్షల చెక్కు అందజేసిన మంత్రి కొలుసు పార్థసారథి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 05:38 PM
35 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడులోని మంత్రివర్యుల కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన వడ్లమూడి రామచంద్రరావుకు రూ.1.50 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కును రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు.

అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి ఈ సహాయం కొంత ఊరటనివ్వనుందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం అండగా నిలవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.

చెక్కు అందుకున్న వడ్లమూడి రామచంద్రరావు కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వానికి, మంత్రి కొలుసు పార్థసారథికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు జనసేన నాయకులు తుమ్మల జగన్, వెల్లంకి శ్రీమన్నారాయణ, పాశం నాగబాబు పాల్గొని బాధిత కుటుంబానికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. సీఎంఆర్ఎఫ్ వంటి సంక్షేమ కార్యక్రమాలు ఆపదలో ఉన్న కుటుంబాలకు పెద్ద దిక్సూచిగా నిలుస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు.