BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 18 July 2026, 08:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ ఆవిష్కరణ మాజీ మంత్రి జోగి రమేష్ పిలుపు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jul, 2026 - 08:03 PM
79 వీక్షణలు

జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ ఆవిష్కరణ మాజీ మంత్రి జోగి రమేష్ పిలుపు

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కార్యాలయంలో శనివారం సాయంత్రం మాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్‌ను ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ, పార్టీ శ్రేణులందరూ జగన్ 2.0 సూపర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై మరింత సమర్థంగా పోరాడేందుకు ఈ యాప్ డిజిటల్ వేదికగా ఉపయోగపడుతుందని చెప్పారు.

ప్రతి కార్యకర్తను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో నేరుగా అనుసంధానించే వారధిగా ఈ యాప్ పనిచేస్తుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ చర్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్తలకు ఇది బలమైన సాధనమని అన్నారు.

దేశంలోనే అత్యంత శక్తివంతమైన సామాజిక మాధ్యమ వ్యవస్థ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని జోగి రమేష్ పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను పార్టీ సామాజిక మాధ్యమం ప్రశ్నిస్తుండటంతో కూటమి ప్రభుత్వం దానిని అణచివేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రజల తరఫున పోరాటాన్ని కొనసాగిద్దామని పిలుపునిస్తూ, పార్టీతో పాటు తాను కూడా కార్యకర్తలకు అండగా ఉంటానని జోగి రమేష్ తెలిపారు.