BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ ఆవిష్కరణ మాజీ మంత్రి జోగి రమేష్ పిలుపు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jul, 2026 - 08:03 PM
28 వీక్షణలు

జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ ఆవిష్కరణ మాజీ మంత్రి జోగి రమేష్ పిలుపు

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కార్యాలయంలో శనివారం సాయంత్రం మాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్‌ను ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ, పార్టీ శ్రేణులందరూ జగన్ 2.0 సూపర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై మరింత సమర్థంగా పోరాడేందుకు ఈ యాప్ డిజిటల్ వేదికగా ఉపయోగపడుతుందని చెప్పారు.

ప్రతి కార్యకర్తను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో నేరుగా అనుసంధానించే వారధిగా ఈ యాప్ పనిచేస్తుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ చర్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్తలకు ఇది బలమైన సాధనమని అన్నారు.

దేశంలోనే అత్యంత శక్తివంతమైన సామాజిక మాధ్యమ వ్యవస్థ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని జోగి రమేష్ పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను పార్టీ సామాజిక మాధ్యమం ప్రశ్నిస్తుండటంతో కూటమి ప్రభుత్వం దానిని అణచివేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రజల తరఫున పోరాటాన్ని కొనసాగిద్దామని పిలుపునిస్తూ, పార్టీతో పాటు తాను కూడా కార్యకర్తలకు అండగా ఉంటానని జోగి రమేష్ తెలిపారు.