గీత కార్మికుల హామీలను అమలు చేయాలి
గీత కార్మికుల హామీలను అమలు చేయాలి
అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ కల్లు గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పామనుగుళ్ళ అచ్చాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం చిట్యాల మండల కేంద్రంలోని మేకల లింగయ్య స్మారక భవనంలో కల్లు గీత కార్మిక సంఘం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జీవో ప్రకారం 50 సంవత్సరాలు పైబడిన గీత కార్మికులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. గీత కార్మికుల సమస్యల సాధనకై ఆగస్టు 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అమరవీరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.vమామిడి హన్మంతు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం మండల నాయకులు కట్టగూరి శ్రీను, ఊడుగు సత్తయ్య, బండారు వెంకన్న, మీనయ్య, ముత్తయ్య, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.