నాగసముద్రంలో విషాదంలో ఉన్న కుటుంబాలకు ఎంపీ వంశీకృష్ణ భరోసా
నాగసముద్రంలో విషాదంలో ఉన్న కుటుంబాలకు ఎంపీ వంశీకృష్ణ భరోసా
దండేపల్లి: మండలంలోని నాగసముద్రం గ్రామానికి చెందిన దుర్గం పోషం, గూడ మల్లేష్ల కుటుంబాల్లో ఇటీవల చోటుచేసుకున్న విషాద ఘటనల పట్ల పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన బాధిత కుటుంబ సభ్యులను నేరుగా కలిసి పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచించిన ఆయన, బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న అనంతరం ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఎలాంటి కష్టం వచ్చినా తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఎంపీ వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.