బోయకొండ ఆలయంలో కిక్కిరిస్తున్న భక్తజనం
బోయకొండ ఆలయంలో కిక్కిరిస్తున్న భక్తజనం
చౌడేపల్లి, అన్నమయ్య జిల్లా
శక్తి క్షేత్రం బోయకొండ పై ఆదివారం భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది వేసవి సెలవులు కావడంతో రాష్ట్రం తో పాటు కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో యాత్రికులు బోయకొండకు తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారి క్యూ లైన్ లన్నీ భక్తులతో కిటకిట లాడాయి. ముఖ్యంగా కొండపైకి వాహన రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి ఆలయ పేద పండితులు అర్చకులు అమ్మవారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు ఏకాంబరం యాత్రికుల వసతులను సమకూర్చారు ఆలయ అధికార అర్చక సిబ్బంది సేవలందించారు చౌడేపల్లి ఎస్ఐ చిన్న రెడ్డప్ప కొండపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అదేవిధంగా వాహన రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.