BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

బీసీ సింహ గర్జన మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ
06 Feb, 2026 - 11:28 AM
101 వీక్షణలు
పుంగనూరులో ‘బీసీ సింహ గర్జన’ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ ఈ నెల 22న జరిగే సభను విజయవంతం చేయాలని పిలుపు NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు  ఈ నెల 22న బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “బీసీ సింహ గర్జన” మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ పుంగనూరు నియోజకవర్గంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ ఎద్దుల హరిబాబు యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బీసీ వర్గాలు కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల హక్కులు, అభ్యున్నతి కోసం నిర్వహించనున్న ఈ మహాసభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 22న గుంటూరు–విజయవాడ జాతీయ రహదారిపై నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఖర్చురి ప్రాంగణంలో “బీసీ సింహ గర్జన” మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు పుంగనూరు నియోజకవర్గం నుంచి భారీగా పాల్గొని బీసీల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీఏసీ కమిటీ సభ్యుడు పాల రమేష్ యాదవ్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు చనకంటి సాంబమూర్తి, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గిరిబాబు కుమ్మరతో పాటు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, స్థానిక బీసీ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు “బీసీల ఐక్యతే మన బలం… బీసీ సింహ గర్జనను విజయవంతం చేద్దాం” అని పిలుపునిచ్చారు. #BCSimhaGarjana #BCUnity #Punganur #BCMovement #SocialJustice #AndhraPradeshPolitics Follow us on Website Facebook Instagram YouTube