BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

బీసీ సింహ గర్జన మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ
06 Feb, 2026 - 11:28 AM
60 వీక్షణలు
పుంగనూరులో ‘బీసీ సింహ గర్జన’ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ ఈ నెల 22న జరిగే సభను విజయవంతం చేయాలని పిలుపు NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు  ఈ నెల 22న బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “బీసీ సింహ గర్జన” మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ పుంగనూరు నియోజకవర్గంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ ఎద్దుల హరిబాబు యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బీసీ వర్గాలు కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల హక్కులు, అభ్యున్నతి కోసం నిర్వహించనున్న ఈ మహాసభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 22న గుంటూరు–విజయవాడ జాతీయ రహదారిపై నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఖర్చురి ప్రాంగణంలో “బీసీ సింహ గర్జన” మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు పుంగనూరు నియోజకవర్గం నుంచి భారీగా పాల్గొని బీసీల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీఏసీ కమిటీ సభ్యుడు పాల రమేష్ యాదవ్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు చనకంటి సాంబమూర్తి, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గిరిబాబు కుమ్మరతో పాటు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, స్థానిక బీసీ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు “బీసీల ఐక్యతే మన బలం… బీసీ సింహ గర్జనను విజయవంతం చేద్దాం” అని పిలుపునిచ్చారు. #BCSimhaGarjana #BCUnity #Punganur #BCMovement #SocialJustice #AndhraPradeshPolitics Follow us on Website Facebook Instagram YouTube