BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

బీసీ సింహ గర్జన మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ
06 Feb, 2026 - 11:28 AM
156 వీక్షణలు
పుంగనూరులో ‘బీసీ సింహ గర్జన’ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ ఈ నెల 22న జరిగే సభను విజయవంతం చేయాలని పిలుపు NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు  ఈ నెల 22న బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “బీసీ సింహ గర్జన” మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ పుంగనూరు నియోజకవర్గంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ ఎద్దుల హరిబాబు యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బీసీ వర్గాలు కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల హక్కులు, అభ్యున్నతి కోసం నిర్వహించనున్న ఈ మహాసభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 22న గుంటూరు–విజయవాడ జాతీయ రహదారిపై నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఖర్చురి ప్రాంగణంలో “బీసీ సింహ గర్జన” మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు పుంగనూరు నియోజకవర్గం నుంచి భారీగా పాల్గొని బీసీల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీఏసీ కమిటీ సభ్యుడు పాల రమేష్ యాదవ్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు చనకంటి సాంబమూర్తి, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గిరిబాబు కుమ్మరతో పాటు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, స్థానిక బీసీ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు “బీసీల ఐక్యతే మన బలం… బీసీ సింహ గర్జనను విజయవంతం చేద్దాం” అని పిలుపునిచ్చారు. #BCSimhaGarjana #BCUnity #Punganur #BCMovement #SocialJustice #AndhraPradeshPolitics Follow us on Website Facebook Instagram YouTube