www.ntodaynews.com
బీసీ సింహ గర్జన మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ
పుంగనూరులో ‘బీసీ సింహ గర్జన’ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
ఈ నెల 22న జరిగే సభను విజయవంతం చేయాలని పిలుపు
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు
ఈ నెల 22న బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “బీసీ సింహ గర్జన” మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ పుంగనూరు నియోజకవర్గంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ ఎద్దుల హరిబాబు యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బీసీ వర్గాలు కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల హక్కులు, అభ్యున్నతి కోసం నిర్వహించనున్న ఈ మహాసభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ఈ నెల 22న గుంటూరు–విజయవాడ జాతీయ రహదారిపై నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఖర్చురి ప్రాంగణంలో “బీసీ సింహ గర్జన” మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు పుంగనూరు నియోజకవర్గం నుంచి భారీగా పాల్గొని బీసీల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీఏసీ కమిటీ సభ్యుడు పాల రమేష్ యాదవ్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు చనకంటి సాంబమూర్తి, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గిరిబాబు కుమ్మరతో పాటు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, స్థానిక బీసీ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు
“బీసీల ఐక్యతే మన బలం… బీసీ సింహ గర్జనను విజయవంతం చేద్దాం” అని పిలుపునిచ్చారు.
#BCSimhaGarjana
#BCUnity
#Punganur
#BCMovement
#SocialJustice
#AndhraPradeshPolitics
Follow us on
Website
Facebook
Instagram
YouTube