BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

పండిట్ ధీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ -2026

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
07 Apr, 2026 - 10:02 PM
16 వీక్షణలు

రొంపిచర్లలో బీజేపీ ‘దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026’ కార్యక్రమం నిర్వహణ

పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ‘పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026’ కార్యక్రమం నిర్వహించారు. మండలాధ్యక్షుడు గేరిగ నాగరాజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

కార్యక్రమానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు అడపా మల్లికా రాణి, చిత్తూరు జిల్లా కార్యదర్శి అబ్బా రెడ్డి వెంకటరమణ నాయుడు, పుంగనూరు మండల అధ్యక్షుడు జగదీశ్ రాజు, సోషల్ మీడియా కన్వీనర్ నరేష్ వక్తలుగా హాజరయ్యారు. పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, కార్యకర్తల పాత్రపై వారు వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయిలో మరింత బలంగా తీసుకెళ్లాలని, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. శిక్షణా కార్యక్రమాలు పార్టీ బలోపేతానికి దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ ముచింతల వెంకటరమణ నాయుడు, వి.వి. సుధాకర్ రెడ్డి, మునిరత్నం, శేషాద్రి నాయుడు, అశోక్, భరత్ కుమార్, చంద్రయ్య, వెంకటరెడ్డి తదితరులు మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.