BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

పండిట్ ధీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ -2026

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
07 Apr, 2026 - 10:02 PM
45 వీక్షణలు

రొంపిచర్లలో బీజేపీ ‘దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026’ కార్యక్రమం నిర్వహణ

పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ‘పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026’ కార్యక్రమం నిర్వహించారు. మండలాధ్యక్షుడు గేరిగ నాగరాజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

కార్యక్రమానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు అడపా మల్లికా రాణి, చిత్తూరు జిల్లా కార్యదర్శి అబ్బా రెడ్డి వెంకటరమణ నాయుడు, పుంగనూరు మండల అధ్యక్షుడు జగదీశ్ రాజు, సోషల్ మీడియా కన్వీనర్ నరేష్ వక్తలుగా హాజరయ్యారు. పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, కార్యకర్తల పాత్రపై వారు వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయిలో మరింత బలంగా తీసుకెళ్లాలని, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. శిక్షణా కార్యక్రమాలు పార్టీ బలోపేతానికి దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ ముచింతల వెంకటరమణ నాయుడు, వి.వి. సుధాకర్ రెడ్డి, మునిరత్నం, శేషాద్రి నాయుడు, అశోక్, భరత్ కుమార్, చంద్రయ్య, వెంకటరెడ్డి తదితరులు మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.