BREAKING
గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
Date of Publish : 07 April 2026, 10:02 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పండిట్ ధీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ -2026

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
07 Apr, 2026 - 10:02 PM
119 వీక్షణలు

రొంపిచర్లలో బీజేపీ ‘దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026’ కార్యక్రమం నిర్వహణ

పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ‘పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026’ కార్యక్రమం నిర్వహించారు. మండలాధ్యక్షుడు గేరిగ నాగరాజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

కార్యక్రమానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు అడపా మల్లికా రాణి, చిత్తూరు జిల్లా కార్యదర్శి అబ్బా రెడ్డి వెంకటరమణ నాయుడు, పుంగనూరు మండల అధ్యక్షుడు జగదీశ్ రాజు, సోషల్ మీడియా కన్వీనర్ నరేష్ వక్తలుగా హాజరయ్యారు. పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, కార్యకర్తల పాత్రపై వారు వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయిలో మరింత బలంగా తీసుకెళ్లాలని, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. శిక్షణా కార్యక్రమాలు పార్టీ బలోపేతానికి దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ ముచింతల వెంకటరమణ నాయుడు, వి.వి. సుధాకర్ రెడ్డి, మునిరత్నం, శేషాద్రి నాయుడు, అశోక్, భరత్ కుమార్, చంద్రయ్య, వెంకటరెడ్డి తదితరులు మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.