www.ntodaynews.com
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారం: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారం: సీఎం చంద్రబాబు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కొత్త విమానాశ్రయం ఆ ప్రాంత ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధికి కొత్త దిశ చూపిస్తూ ఉత్తరాంధ్ర స్థితిగతులను పూర్తిగా మార్చేస్తుందని పేర్కొన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు విస్తరించి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు.