భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ చారిత్రక వేడుకకు ఉత్తరాంధ్ర ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు.
భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని, ఉపాధి, పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక రంగాల విస్తరణకు ఇది కీలకంగా మారుతుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మన భోగాపురం విమానాశ్రయం.. మన గర్వం, మన వైభోగం” అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర భవిష్యత్ అభివృద్ధికి మైలురాయిగా నిలిచే ఈ కార్యక్రమంలో ప్రజలు విశేషంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.