www.ntodaynews.com
కౌంటింగ్ రోజే బీజేపీ అభ్యర్థి మృతి
తెలంగాణ
లక్షెట్టిపేటలో విషాదం: కౌంటింగ్ రోజే బీజేపీ అభ్యర్థి ఎల్లమ్మ మృతి
NTODAY NEWS: మంచిర్యాల ప్రతినిధి శ్రీనివాస్
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున విషాద ఘటన చోటుచేసుకుంది. 10వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎల్లమ్మ అనారోగ్యంతో శుక్రవారం మరణించారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లమ్మ పరిస్థితి కౌంటింగ్ సమయంలో విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫలితాల ఉత్కంఠ నడుమ ఆమె మృతి వార్త తెలిసి కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్థానిక నాయకులు కౌంటింగ్ కేంద్రం వద్ద మౌనం పాటించి నివాళులర్పించారు.
ఎన్నికల ప్రక్రియపై అధికారుల స్పష్టం
అభ్యర్థి మరణించినప్పటికీ పోలింగ్ ఇప్పటికే పూర్తయినందున ఓట్ల లెక్కింపు ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఒకవేళ ఎల్లమ్మ విజయం సాధించినట్లయితే, నిబంధనల ప్రకారం ఆ వార్డు స్థానాన్ని ఖాళీగా ప్రకటించి ఉపఎన్నిక నిర్వహిస్తారు. ఇతర అభ్యర్థి మెజారిటీ సాధిస్తే, ఆయన్ను/ఆమెను విజేతగా ప్రకటిస్తారు.
#Luxettipet #Mancherial #MunicipalElections #BJP #ElectionCounting #TelanganaNews #BreakingNews #LocalNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube