BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 07 February 2026, 09:38 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బీఆర్‌ఎస్–బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు

తెలంగాణ
07 Feb, 2026 - 09:38 AM
203 వీక్షణలు
బీఆర్‌ఎస్–బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: కరీంనగర్ రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు లోపాయికారీగా ఒక్కటై కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కోలగాని అనిల్ తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం 54, 30, 31, 32, 33 డివిజన్ల కాంగ్రెస్ అభ్యర్థుల మద్దతుగా నాకా చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో మంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, ఆ వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో గెలిచే కాంగ్రెస్ కార్పొరేటర్ల ద్వారా అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కరీంనగర్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఒకటేనని మరోసారి ఆరోపించిన మంత్రి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. #CongressCampaign #MunicipalElections #Karimnagar #TelanganaPolitics #AdluriLaxmanKumar #WelfarePolitics #UrbanDevelopment Follow us on Website Facebook Instagram YouTube