BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

బీఆర్‌ఎస్–బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు

తెలంగాణ
07 Feb, 2026 - 09:38 AM
85 వీక్షణలు
బీఆర్‌ఎస్–బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: కరీంనగర్ రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు లోపాయికారీగా ఒక్కటై కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కోలగాని అనిల్ తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం 54, 30, 31, 32, 33 డివిజన్ల కాంగ్రెస్ అభ్యర్థుల మద్దతుగా నాకా చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో మంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, ఆ వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో గెలిచే కాంగ్రెస్ కార్పొరేటర్ల ద్వారా అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కరీంనగర్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఒకటేనని మరోసారి ఆరోపించిన మంత్రి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. #CongressCampaign #MunicipalElections #Karimnagar #TelanganaPolitics #AdluriLaxmanKumar #WelfarePolitics #UrbanDevelopment Follow us on Website Facebook Instagram YouTube