BREAKING
రూ.12 లక్షలతో నిర్మించిన ఆర్‌వో వాటర్ ప్లాంట్ ప్రారంభం చనుబండ విద్యార్థుల ఘనత.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి.. ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక రూ.12 లక్షలతో నిర్మించిన ఆర్‌వో వాటర్ ప్లాంట్ ప్రారంభం చనుబండ విద్యార్థుల ఘనత.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి.. ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
www.ntodaynews.com

పెహల్గాం తీవ్రవాదుల దాడిని ఖండిస్తూ జనసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

తెలంగాణ
25 Apr, 2025 - 08:45 PM
291 వీక్షణలు
పెహల్గాం తీవ్రవాదుల దాడిని ఖండిస్తూ జనసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ...... ఇబ్రహీంపట్నం,ఆంధ్రప్రదేశ్. ఇది మన దేశం మీద జరిగిన దాడి అని ముక్తకంఠంతో నినాదించారు కొండపల్లి ప్రజలు జమ్మూ కాశ్మీర్ పహల్గం తీవ్రవాదుల దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొండపల్లి ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి కొవ్వొత్తులు వెలిగించి తీవ్రవాదుల దాడిని ఖండించారు. దాడిలో మరణించిన వారికీ నివాళులర్పించారు. భారత్ మాతాకీ జై, ఉగ్రవాదం డౌన్ డౌన్ అంటూ నినాదించారు. ర్యాలీలో మతాలకు అతీతంగా ప్రజలు, మహిళలు, చిన్నపిల్లలు మేము సైతం అంటూ నినాదించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్రావు (గాంధీ) మాట్లాడుతూ ఇది భారత దేశం మీద జరిగిన దాడి అత్యంత బాధాకరమైన విషయం అన్నారు.దేశంలో మళ్ళీ ఇలాంటి తీవ్రవాద ఘటనలు జరగకుండా బలంగా తిరిగి కొట్టాలని కోరారు. ఇలాంటి సమయంలో ప్రజలందరూ సమన్వయం పాటించాలని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అందరూ ఐక్యమత్యం తో ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షులు బోలిశెట్టి శ్రీకాంత్, మున్సిపాలిటీ అధ్యక్షుడు చెరుకుమల్లి సురేష్,నాని, వెంకటేశ్వరరావు,వీర మహిళలు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube