BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 25 April 2025, 08:45 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

పెహల్గాం తీవ్రవాదుల దాడిని ఖండిస్తూ జనసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

తెలంగాణ
25 Apr, 2025 - 08:45 PM
396 వీక్షణలు
పెహల్గాం తీవ్రవాదుల దాడిని ఖండిస్తూ జనసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ...... ఇబ్రహీంపట్నం,ఆంధ్రప్రదేశ్. ఇది మన దేశం మీద జరిగిన దాడి అని ముక్తకంఠంతో నినాదించారు కొండపల్లి ప్రజలు జమ్మూ కాశ్మీర్ పహల్గం తీవ్రవాదుల దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొండపల్లి ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి కొవ్వొత్తులు వెలిగించి తీవ్రవాదుల దాడిని ఖండించారు. దాడిలో మరణించిన వారికీ నివాళులర్పించారు. భారత్ మాతాకీ జై, ఉగ్రవాదం డౌన్ డౌన్ అంటూ నినాదించారు. ర్యాలీలో మతాలకు అతీతంగా ప్రజలు, మహిళలు, చిన్నపిల్లలు మేము సైతం అంటూ నినాదించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్రావు (గాంధీ) మాట్లాడుతూ ఇది భారత దేశం మీద జరిగిన దాడి అత్యంత బాధాకరమైన విషయం అన్నారు.దేశంలో మళ్ళీ ఇలాంటి తీవ్రవాద ఘటనలు జరగకుండా బలంగా తిరిగి కొట్టాలని కోరారు. ఇలాంటి సమయంలో ప్రజలందరూ సమన్వయం పాటించాలని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అందరూ ఐక్యమత్యం తో ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షులు బోలిశెట్టి శ్రీకాంత్, మున్సిపాలిటీ అధ్యక్షుడు చెరుకుమల్లి సురేష్,నాని, వెంకటేశ్వరరావు,వీర మహిళలు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube