BREAKING
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం!
www.ntodaynews.com

మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు....

తెలంగాణ
05 Apr, 2025 - 09:15 AM
262 వీక్షణలు
స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు.... సర్పంచ్ మీనుగ లలితమ్మ ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు ఆధ్వర్యంలో..... (కూడేరు) ఏప్రిల్ 5-Ntoday News స్థానిక కూడేరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణ నందు భారతదేశం మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు కూడేరులో సర్పంచ్ మీనుగు లలిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ సామాజిక న్యాయం,హక్కుల కోసం ఐక్య ఉద్యమాలకు ఎంతో ఆయన శ్రమించడం జరిగిందని తెలియజేశారు మొదటగా బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగానివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ కాలంలో అంటరానితనం, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు జగ్జీవన్ రామ్ అని అన్నారు.స్వాతంత్రానంతరం సమానత్వం,సామాజిక న్యాయం,హక్కుల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు.ఆయన ఆశయాలను అందరం కలిసి ముందుకు తీసుకుపోవాలన్నారు.నేటికీ సామాజిక న్యాయం,హక్కులు,చట్టాలు అట్టడుగువర్గాలకు అందలేదని,బాబు జగ్జీవన్ రామ్ చూపిన బాటలో సమానత్వం కోసం పోరాడాలన్నారు.ప్రపంచీకరణ,ప్రైవేటీకరణ,సరళీకరణ పేరుతో పాలకుల అవలంబిస్తున్న విధానాల వల్ల రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు.దళిత,గిరిజన,బలహీన వర్గాలు ఏకమై హక్కుల సాధనకై పోరాడాలన్నారు. బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర కాలంలో,స్వతంత్ర అనంతరం కూడా బడుగు బలహీన వర్గాలకోసం కృషి చేసారన్నారు.దోపిడీ,పీడన అంతం అయ్యేంతవరకు ఆయన స్ఫూర్తితో అందరం పోరాడాలన్నారు.ఈ కార్యక్రమంలో కూడేరు గ్రామపంచాయతీ సర్పంచ్ లలితమ్మ, ఎంపీటీసీ భర్త తోపుదుర్తి రామాంజనేయులు, రామదుర్గం కిష్టప్ప, శంకర్ నాయక్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మన్న, సర్పంచ్ భర్త చిన్న ఈశ్వరయ్య, ఎడమల ఈశ్వరయ్య, మాల మహానాడు మండల అధ్యక్షుడు పరమేష్ విహెచ్పిఎస్ నాయకులు కలగళ్ల ముత్యాలు, జల్లిపల్లి వెంకటేశులు, వివిధ గ్రామాలకు చెందిన దళిత నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.... Follow us on Website Facebook Instagram YouTube