BREAKING
స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్ స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్
www.ntodaynews.com

చాట్రాయి దివంగత ఏ ఎస్సై కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా ఎస్పీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 May, 2026 - 04:32 PM
120 వీక్షణలు

ఏలూరు జిల్లా చాట్రాయి పోలీస్ స్టేషన్‌లో ఏ.ఎస్సైగా విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో ఏప్రిల్‌ 2, 2026న మరణించిన వంగాల మాధవ రెడ్డి కుటుంబానికి జిల్లా పోలీస్ శాఖ అండగా నిలిచింది. సోమవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ దివంగత మాధవ రెడ్డి భార్య సుజాతకు పోలీస్ అధికారుల సంఘం తరఫున రూ.1 లక్ష చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మాధవ రెడ్డి కుటుంబానికి ఇప్పటికే ఫ్లాగ్ ఫండ్ నుంచి రూ.25 వేలు, విడో ఫండ్ నుంచి రూ.50 వేల చెక్కులను అందజేసినట్లు తెలిపారు. పోలీస్ శాఖకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మరణం శాఖకు తీరని లోటని పేర్కొన్నారు.

ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రాయితీలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలు కల్పించేందుకు సిఫార్సు చేస్తామని తెలిపారు. అవసరమైతే తమను నేరుగా కలవవచ్చని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఆర్. నాగేశ్వరరావు, పోలీస్ ప్రధాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.